ఇంగువ మాధురి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 185: పంక్తి 185:


నమో నమో జగత్తారిణీ పాహి దుర్గే
నమో నమో జగత్తారిణీ పాహి దుర్గే

"బొట్టు"


(మరెన్నో కవితలు)
(మరెన్నో కవితలు)
పంక్తి 213: పంక్తి 215:
ఆమె కథ “పడమటి ప్రమిద”కు ఇటీవల 2024 ఏప్రిల్ లో జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి కుమారులు జీడిగుంట విజయసారథి, కథాకళ కార్యక్రమ రూపకర్త విజయభాస్కర్ సంయుక్తంగా "జీడిగుంట రామచంద్రమూర్తి పురస్కారం" ఇచ్చి కాలిఫోర్నియాలో గౌరవించారు.
ఆమె కథ “పడమటి ప్రమిద”కు ఇటీవల 2024 ఏప్రిల్ లో జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి కుమారులు జీడిగుంట విజయసారథి, కథాకళ కార్యక్రమ రూపకర్త విజయభాస్కర్ సంయుక్తంగా "జీడిగుంట రామచంద్రమూర్తి పురస్కారం" ఇచ్చి కాలిఫోర్నియాలో గౌరవించారు.


ఇప్పటిదాకా 200 కవితలు, గేయాలు, 100కు పైగా కథలు,4 నవలలు ప్రచురించటమే కాక 50కు పైగా సాహితీ సమావేశాలలో పలు సాహితీ అంశాల పైన ప్రసంగించారు. మరెన్నో రచనలు 2024-2025 మధ్య ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. 2024 మే మాసంలో వాషింగ్టన్ స్టేట్ధా లోని 'తెలంగాణా అమెరికా తెలుగు అసోసియేషన్" వారి ఆధ్వర్యంలో 'శ్రీ పాలడుగు శ్రీ చరణ్' గారి అష్టవధాన కార్యక్రమంలో మాధురికి పృచ్ఛకురాలిగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఎంతో ఆసక్తి.
ఇప్పటిదాకా 200 కవితలు, గేయాలు, 100కు పైగా కథలు, వ్యాసాలు, 4 నవలలు ప్రచురించటమే కాక 50కు పైగా సాహితీ సమావేశాలలో పలు సాహితీ అంశాల పైన ప్రసంగించారు. మరెన్నో రచనలు 2024-2025 మధ్య ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. 2024 మే మాసంలో వాషింగ్టన్ స్టేట్ లోని 'తెలంగాణా అమెరికా తెలుగు అసోసియేషన్" వారి ఆధ్వర్యంలో 'శ్రీ పాలడుగు శ్రీచరణ్' గారి అష్టావధాన కార్యక్రమంలో మాధురికి పృచ్ఛకురాలిగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఆవిడకు ఎంతో ఆసక్తి.


మాధురి త్వరలో 'వేటూరి గీతామృతం' అనే పేరిట పలు సంకలనాలను వెలువరించనున్నారు. వేటూరి సుందరరామ్మూర్తి గారి పాటల యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు ఈ పుస్తకాల సంపుటాలలో సమగ్రంగా లభించనున్నాయి. అన్ని వర్గాల శ్రోతలకే కాక భావి గీత రచయితలకు, గాయకులకు, భాషాభిమానులకు, తెలుగు విద్యార్థులకు, వేటూరి అభిమానులకు కూడా ఇది ఎంతో ఉపయుక్తమైన గ్రంథం కాగలదని పలువురు భాషాపండితుల విశ్వాసం.
మాధురి త్వరలో 'వేటూరి గీతామృతం' అనే పేరిట పలు సంకలనాలను వెలువరించనున్నారు. వేటూరి సుందరరామ్మూర్తి గారి పాటల యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు ఈ పుస్తకాల సంపుటాలలో సమగ్రంగా లభించనున్నాయి. అన్ని వర్గాల శ్రోతలకే కాక భావి గీత రచయితలకు, గాయకులకు, భాషాభిమానులకు, తెలుగు విద్యార్థులకు, వేటూరి అభిమానులకు కూడా ఇది ఎంతో ఉపయుక్తమైన గ్రంథం కాగలదని పలువురు భాషాపండితుల విశ్వాసం.

21:00, 14 మే 2024 నాటి కూర్పు

ఇంగువ మాధురి:

రచయిత్రి శ్రీమతి ఇంగువ మాధురి సెప్టెంబర్ 9 న,హైదరాబాదులో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ యడవల్లి గిరిజ కామేశ్వరరావు దంపతులు. వారి పూర్వీకులు అయిదు తరాలు విజయవాడ సత్యనారాయణపురంలోనే నివాసం ఉండేవారు. మాధురి బామ్మగారు శ్రీమతి వెంకటలక్ష్మీ సరోజినీభాస్కరం గారు.(1926–2014) విజయవాడలో పుట్టి పెరిగి, SSLC పాసై,1945-47 మధ్య విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో నర్సు శిక్షణ పూర్తి చేశారు. తదుపరి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సు ఉద్యోగం చేస్తూ, బదిలీలపై ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలన్నిoటిలో పనిచేశారు. అప్పటి ఇంగ్లీషు డాక్టర్లు ఆమె పేరు నోరు తిరగక క్లుప్తంగా ‘రోజా’ అని పిలిచేవారు. ఆరోజుల్లో అంటే 1926 కాలంలో పుట్టిన అమ్మాయిలు చదువుకొని ఉద్యోగం చేయడం ఊహకు అందని విషయం. వెంకటలక్ష్మీసరోజినీ భాస్కరం గారికి 1952లో యడవల్లి పూర్ణచంద్రరావుగారితో వివాహం జరిగింది. అప్పటికే ఆవిడ ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలు చక్కగా చదువుకొన్న విద్యావతి, చరిత్ర, శాస్త్రవిషయాలు బాగా తెలిసిన మహిళ, ఉద్యోగస్తురాలు కూడా. ఈ బామ్మగారి ప్రభావం బాల మాధురి పైన కనబడుతుంది.

మాధురి తండ్రిగారు యడవల్లి కామేశ్వరరావుగారు హైదరాబాదులో జన్మించినా, ఆయన తల్లివెంట ఆంధ్రదేశమంతా తిరగడం వల్ల వివిధ కాలేజీలలో చదవటం వలన విస్తృతమైన లోకానుభవం ఆయనకు కలిగింది. కామేశ్వరరావు గారికి మేనమామ కూతుర్తె అయిన గిరిజ గారితో 1977లో విజయవాడలో పరిణయం జరిగింది. 1982లో ఆయన ఉద్యోగరిత్యా తిరిగి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.వీరికి ఇద్దరు సంతానం. యడవల్లి విజయ్, మాధురి.

కీ. శే|| గిరిజగారు(1956-2010) గొప్ప గాయని, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేది. మాధురికి గారి అన్న యడవల్లి విజయ్, హైదరాబాదులో స్థిరపడ్డ IT రంగ నిపుణులు. మాధురి హైదరాబాదులో పుట్టి పెరిగి ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నా ఇంట్లో పెద్దలు తెలుగు భాషాభిమానం, సంస్కృతీ సంప్రదాయాల క్షుణ్ణంగా నేర్పారు.

విద్యాభ్యాసం:

మాధురి విద్యాభాసం అంతా హైదరాబాదులో వివిధ విద్యాలయాలలో ఇంగ్లీషు మాధ్యమంలోనే సాగినా, బాల్యంనుంచీ బామ్మ ప్రేరణ, ప్రోత్సాహంవల్ల పదో ఏటినుంచే పురాణ గాథలు, తెలుగు ప్రబంధ కథలతో పరిచయం కలిగి, సాహిత్యంలో ప్రవేశం, అభిరుచి ఏర్పడింది. ఎన్నో తెలుగు వ్యాస రచన పోటీలలో ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. కనుకనే ఆంగ్లాన్ని వీడి Central University of Hyderabad లో ఆమె తెలుగు ఏం.ఏ లో చేరి అసాధారణ ప్రతిభ కనబరచి అత్యుత్తమ శ్రేణిలో పాసయ్యారు.

రచనా వ్యాసంగం:

మాధురి రచనా వ్యాసంగం పదవ ఏట నుండి ప్రారంభం అయింది. ప్యారెడి పాటలు, కవితలు వ్రాస్తున్నా తొలికథ “చెల్లాయ్" మాత్రం ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఆమె 13వ ఏట 1995లో అచ్చయింది, తొలి రేడియో కవితాగానం 1999 లో ఆకాశవాణి హైదరాబాదు నుంచి ప్రసారం అయింది.

వివాహం:

2003లో M.A చదువుతుండగా శ్రీ ఇంగువ సాంబశివ రావుగారితో వివాహం జరిపారు పెద్దలు. ఆపైన MA పూర్తి చేసి గృహిణిగా ఉంటూనే కవితా రచన కొనసాగించారు.

రేడియో జాకీ, న్యూస్ రీడర్, అనువాదకురాలు:

2008లో ఆకాశవాణిలో చేరడం ఆమె జీవితంలో గొప్ప మలుపు. 2008-2014 మధ్య మీడియా రంగంలోని అన్ని విభాగాల్లో మాధురి శిక్షణపొంది, రేడియో, టీవి మాధ్యమాల్లోని వేరువేరు శాఖల్లో పనిచేశారు. ఆకాశవాణిలో FM Rainbow లో రేడియోజాకీగా కొంతకాలం పనిచేయడమే కాదు, చిత్రసీమలోని వివిధ గీత రచయితల గురించీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో ప్రేరణాత్మక మహిళల గురించీ కార్యక్రమాలు నిర్వహించారు. 2012-2014మధ్య దూరదర్శన్ లో వార్తలు కొంతకాలం చదివారు. 2010-2012మధ్య కేంద్ర ప్రభుత్వ పత్రిక యోజనలో అనువాదక బాధ్యతలు కూడా నిర్వహించారు. 2008-2014 మధ్య ప్రైవేటు వ్యాపారప్రకటనా సంస్థలో క్రియేటివ్ హెడ్ గా కొంతకాలం పనిచేశారు. ఆపై 2014 నుండి భర్త గారి ఉద్యోగరిత్యా విదేశీయానాల వల్ల మీడియా రంగానికి దూరం కావలసి వచ్చినప్పటికీ, అంతర్జాల పత్రికలకు కథలు, కవితలు, ధారావాహికలు వ్రాసేవారు.

రచనలు:

తపస్వీ మనోహరం ప్రచురణల సౌజన్యంతో నవలా రచయిత్రిగా విశేష ఖ్యాతిని పొందారు 1.వజ్రకుండం 2. మనసిజ 3. నందు వర్సెస్ నందు 4.మా అమ్మకోసం.

 ఈ నాలుగు నవలలూ ఆమెకు విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా తొలినవల వజ్రకుండం గురించి ఒక విశేషం చెప్పుకోవాలి. 26 వేల పదాలలో రాసిన వజ్రకుండం కాల్పనిక నవలలో ఒక్క ఆంగ్లపదం కూడా వాడుక చేయక సరళ గ్రాంథికo వాడి తనకు తెలుగు భాషమీద గొప్ప పట్టుందని నిరూపించుకున్నారు. ఈ నవలకు ఆస్కార్ అవార్డు గ్రహీత, గీత రచయిత శ్రీ చంద్రబోసు గారు మున్నుడి వ్రాసారు.  

కథలు : చెల్లాయ్

సంసార సాగరం

ట్రాష్ బిన్

పారిపోoడ్రోయ్

శ్రావనమేఘాలు

ఒక చిట్టి కథ

వర్షప్రియ

ధీరవనిత

అవధాని

కామెడీ కాంతారావ్

ముగ్థమణి

నవ్విందీ మల్లేచెండు

దేవుడికి డిస్కౌంట్

ఫస్ట్ క్రష్

నిశీథి కలలు

పరిమళ

పునర్జన్మ

పడమటి ప్రమిద

కళ్యాణి రాగం

త్రీ సిక్స్టీ డిగ్రీస్

మౌనమై మెరిసి

కొత్తేడు

రెడీ మేడ్ సంక్రాంతి

25 బాలల కథలు (మరెన్నో)

కవితలు:

వెన్నెల

బాల్యస్మృతి

అప్సరోభామిని

ఆశ

ప్రేమ ఇంద్రజాలం

ఎవరివో నీవేవరివో

రేపెళదాం నిన్నట్లోకి

చైతన్యం

బండరాళ్లు

ఇదిగో నిన్నే

తునక

నవ్యత

ప్రేమ ఖరీదు

ప్రణయ సుందరి

ప్రేమ యాత్ర

అభిషేకం

ప్రేమ కోసం

జైత్రయాత్ర

నీవెవరు

ఒక్క క్షణమేగా

పరవశం

రతిలోక మణి

ఉలికిపడు

నీ జతలో

నీకై నేను

ఎర్ర కాటుక

విధి వంచిత

రాధే గోవిందం

గోపాలుడికోసం ఈ రాధ

ఎవరో ఆ సుందరి

ప్రేమవర్షం

ప్రేమినంటావా

శక్తినివ్వు

ఎన్ని చినుకులో

కొట్టవాన

నీ స్మరణం

ప్రేమ ఋతువు

భావాల శీర్షాసనం

నీలో నేనై

కవితావనం

రెండుగ పగిలిన మనసు

సాగే కలలనది

కనిపించని తోడువి

నింగితో వలపు

భగభగమను భానుతేజం

అల్లాడే ప్రాణం

కుహు గీతం

శ్రీమాత్రే నమః

నమో బాలాత్రిపుర సుందరి

నమో నమో జగత్తారిణీ పాహి దుర్గే

"బొట్టు"

(మరెన్నో కవితలు)


పురస్కారాలు:

ఉత్తమ ధారావాహిక రచయిత్రి : ప్రతిలిపి అంతర్జాలపత్రిక 2019 లో 'పెసరట్టు' ధారావాహికకు గానూ ఉత్తమ ధారావాహికా రచయిత్రిగా ఎంపిక చేసి పురస్కారంతో గౌరవించింది. ఆ ధారావాహిక పిదప 'మనసిజ' నవలగా విడుదల అయి ఘనవిజయం సాధించింది.

ఉత్తమ నవలా రచయిత్రి: “తపస్వి మనోహరం “ పత్రిక 2021 లో ఆమె రచన వజ్రకుండంకు గానూ ఉత్తమ నవలా రచయిత్రి అవార్డుతో గౌరవించింది.

ఆడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారం "మా అమ్మకోసం" నవలకు 2023లో "కీ.శే.ఆడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారం" లభించింది.

"గాథా సృజన సoయమి" మాధురి వ్రాసిన బాలల కథాసంకలనానికి ఉస్మానియా రచయితల సంఘం “గాథా సృజన సంయమి” బిరుదు ప్రదానం చేసింది.

ఇవి కాక పలు విశ్వవిద్యాలయాల నుండి పలు విభాగాల రచనలకు గాను 50కి పైగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.


ఇటీవల 2023 అక్టోబర్ లో మాధురి కాలిఫోర్నియా లోని సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీ వారి ఆహ్వానం మీద, ఆ విశ్వవిద్యాలయంలో “తెలుగుభాషా వ్యాప్తి” అనే విషయం మీద ప్రసంగించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో "స్వర్గారోహణ పర్వం - యుధిష్ఠిరుని ధర్మనిష్ఠ" గురించి 2024 ఏప్రిల్ లో ప్రసoగించింది. ఇలా పలు విశ్వావిద్యాలయాలలో పలు సాహితీ అంశాల మీద ప్రసంగిస్తూ ఉండటం ప్రవృత్తి.

జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి అవార్డు. ఆమె కథ “పడమటి ప్రమిద”కు ఇటీవల 2024 ఏప్రిల్ లో జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి కుమారులు జీడిగుంట విజయసారథి, కథాకళ కార్యక్రమ రూపకర్త విజయభాస్కర్ సంయుక్తంగా "జీడిగుంట రామచంద్రమూర్తి పురస్కారం" ఇచ్చి కాలిఫోర్నియాలో గౌరవించారు.

ఇప్పటిదాకా 200 కవితలు, గేయాలు, 100కు పైగా కథలు, వ్యాసాలు, 4 నవలలు ప్రచురించటమే కాక 50కు పైగా సాహితీ సమావేశాలలో పలు సాహితీ అంశాల పైన ప్రసంగించారు. మరెన్నో రచనలు 2024-2025 మధ్య ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. 2024 మే మాసంలో వాషింగ్టన్ స్టేట్ లోని 'తెలంగాణా అమెరికా తెలుగు అసోసియేషన్" వారి ఆధ్వర్యంలో 'శ్రీ పాలడుగు శ్రీచరణ్' గారి అష్టావధాన కార్యక్రమంలో మాధురికి పృచ్ఛకురాలిగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఆవిడకు ఎంతో ఆసక్తి.

మాధురి త్వరలో 'వేటూరి గీతామృతం' అనే పేరిట పలు సంకలనాలను వెలువరించనున్నారు. వేటూరి సుందరరామ్మూర్తి గారి పాటల యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు ఈ పుస్తకాల సంపుటాలలో సమగ్రంగా లభించనున్నాయి. అన్ని వర్గాల శ్రోతలకే కాక భావి గీత రచయితలకు, గాయకులకు, భాషాభిమానులకు, తెలుగు విద్యార్థులకు, వేటూరి అభిమానులకు కూడా ఇది ఎంతో ఉపయుక్తమైన గ్రంథం కాగలదని పలువురు భాషాపండితుల విశ్వాసం.

సాంఘిక సేవాకార్యక్రమాలు :

2003లో వివాహానంతరం శ్రీమతి మాధురి దంపతులు ఎందరో పేద విద్యార్థులకు ఫీజుల కోసం లక్షల రూపాయలు విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించారు. అంతేకాక వారు భారతదేశంలో ఉండగా ప్రతీ శనివారం అన్నదానకార్యక్రమం నిర్వహించేవారు, వారినికి వందమందికి మాధురి గారే స్వయంగా పులిహోర దద్దోజనం వండి సిద్ధం చేసేవారు. ఎన్నో వేదపాఠశాలల పునరుధ్ధరణకు, ఎందరో ముదుసలి వారి వైద్యానికీ, ఎందరో పేదమహిళల వివాహానికీ లక్షల్లో ఆర్థిక సాయం చేసినా ఏనాడు ఫోటోలు, వీడియోలవంటివి తీసుకోలేదు. యే ప్రచారం కల్పించుకోలేదు. కుడిచేత్తో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అని మాధురి గారి బామ్మగారు చెప్పిన మాటకు ఆ దంపతులు కట్టుబడి ఉన్నారు. ఇప్పటికీ అమెరికానుండి దేవాలయాలలో అన్నదానాలకీ, అడవుల సంరక్షణకీ, విద్యాదానానికి వారు లక్షల రూపాయల సహాయం అందిస్తూనే ఉన్నారు.

ఆధ్యాత్మిక ప్రయాణం:

పదవ తరగతిలో ఉండగా మాధురి 'సిద్ధిసమాధి యోగ' తరగతులకు వెళ్ళి తన జీవన శైలిని మార్చుకున్నప్పటికీ వివాహనంతరం కొంత విరామం వచ్చింది. తిరిగి 2015 నుండి ఆవిడ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయింది. ప్రతీ ఉదయం బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేసి, అమ్మవారిని పూజించి, తన ఆధ్యాత్మిక అనుభూతులను గ్రంథస్తo చేసుకుంటారు ఇంగువ మాధురి. ఈ నేపథ్యంలో పురాణ గ్రంథాలే కాక అమ్మవారికి సంబంధించిన ఎన్నో గ్రంథాలను ఆవిడ క్షుణ్ణంగా చదివి ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకున్నారు.

ఆధారాలు;

  1. 1. తొలినవల వజ్రకుండం విడుదల 2021,ఏప్రిల్

2. మనసిజ, నందు వర్సెస్ నందు, మా అమ్మకోసం నవలలు విడుదల ఏకకాలంలో Dec, 2022. 3. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం ఇంగువ మాధురి నుంచి సేకరించిన భోగట్టా.